This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
Aaradhana--1962-
Song » Ohoho Mavayyaa / ఓహొహొ మావయ్యా
Click To Rate




* Voting Result *
0 %
25.00 %
0 %
0 %
75.00 %
Music Station
-MP3 Song Not Available-
English - Lyrics

Lyrics
Telugu - Lyrics

Lyrics
Important information - Telugu

à°“ తరానికి à°ˆ పాట అంటే మహా ఇష్టం. తెలుగు సినిమాలలో హాస్యం అంటే రేలంగే, రేలంగి అంటేనే హాస్యం. రేలంగి గారిమీద చిత్రీకరించబడిన పాటల్లో ఇది à°’à°•à°Ÿà°¿.  రేలంగికి చాలామంది జంటగా నటించినా గిరిజతో నటించిన చిత్రాలు, పాటలు చాలా హిట్ అయ్యాయి. ప్రజలు ఆదరించిన జంట రేలంగి -à°—à°¿à°°à°¿à°œ. వారిద్దరి మీద చిత్రించబడిన గీతం ఇది.
 
ఈ పాట చిత్రీకరణ ఆరోజుల్లో ఎప్పుడూ ఉండేలా ఇంట్లో మాట్లాడుకుంటున్నట్టో, పార్కుల్లో డాన్సు చేస్తున్నట్టో కాకుండా ఒక జూపార్క్ లో చిత్రించబడడం విశేషం.
 
అమ్మాయి పల్లెటూరు అమ్మాయి. మంచి కట్టుబాట్ల మధ్య పెరిగింది. కొద్దిగా మోటుతనం, అమాయకత్వం నిండిన పల్లె పడుచు. తండ్రి పల్లెటూరువాడైనా డబ్బు బాగా ఉంది కనుక కూతురుకి కొంచెం నాగీరకం నేర్పించి నాజూగ్గా కనిపించేలా  చెయ్యాలని, విదేశాలలో ఉండే డాక్టరుకి ఇచ్చి పెళ్ళి చెయ్యాలని కోరిక. అలాంటి అమ్మాయి పట్నవాసంలో పరిచయమయ్యాడు వరసకు  బావ అయిన à°ˆ కుర్రవాడు. పట్నం చూపిస్తానంటూ ఇంటినుంచి బయటకి తీసుకువచ్చాడు. అదీ పాటకి సందర్భం.
సాధారణంగా జానపద గీతాలలో ’బావ’ à°² కన్నా ’మావ’ లే ఎక్కువగా కనిపిస్తారు. జనపదాలకు పుట్టిళ్ళు పల్లెపట్టులే కనుక, à°† అమ్మాయి కూడా పల్లెటూరి నుంచి వచ్చినదే కనుక -  ఆరుద్ర à°ˆ గుట్టు కనిపెట్టి   - à°† అబ్బాయి వరసకి బావే అయినా  - మావయ్యా - అని సంబోదించేట్టు రాశారు.
 "ఓహోహో మావయ్యా ఇదేమయ్యా బలె బలెబాగా ఉందయ్యా.
ఇంటిని విడిచి షికారు కొస్తే ఎంతో హాయి కలదయ్యా...."
అంటూ తనకి  తండ్రి కట్టుబాట్ల మధ్యనుంచి దొరికిన స్వేచ్ఛను అనుభవిస్తూ ఇంటిని విడిచి వచ్చి షికార్లు కొడుతున్నందుకు సంతోషం ప్రకటిస్తుంది.
దాంతో à°† అబ్బాయి  తాము వచ్చిన చోటును గురించి చెప్తాడు.
 
"ఓహొహో అమ్మాయి ఇది కాలేజీ బలె బలె బతికిన కాలేజీ
మాటలురాని మృగాలు కొన్ని మనిషికి పాఠం చెబుతాయి"
అంటూ తాము జూ పార్క్ అని పిలవబడే జంతు ప్రదర్శనశాలకి వచ్చామని చెప్తాడు. జూలో బంధించబడిన జంతువులనుంచి మనం తెలుసుకోదగిన విషయాలెన్నో ఉన్నాయంటూ, "మాటలు రాని మృగాలు సైతం మనిషికి పాఠం చెబుతాయి "అంటాడు. నిజానికి ఈ వాక్యాన్ని గురించి లోతుగా
ఆలోచించగలిగితే - ఇది ప్రేక్షక శ్రోతలను నర్మగర్భంగా ఉద్దేశించినది - అని అర్ధం అవుతుంది.
 
ఇక్కడ జూ పార్కుని ’బతికిన కాలేజీ’ అనే పదంతో ప్రయోగించడమే డొక్క శుద్ధి à°—à°² సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది. చాలా ఏళ్ళపాటు
ఆంధ్ర ప్రాంతాలలో  చాలామంది మద్రాసులోని జూని ’బతికిన కాలేజీ’ అని, మ్యూజియం ని ’చచ్చిన కాలేజీ’ అని పిలిచేవారు
 
పాలగుమ్మి పద్మరాజుగారు మొదటిగా  తన రచనలలో  మద్రాసు జూపార్కు గురించి రాస్తూ ’బతికిన కాలేజీ’ అనే పద ప్రయోగం చేసారని తెలిసింది. à°† ప్రభావంతోనో ఏమో ఆరుద్ర కూడా à°ˆ పాటలో జూపార్క్ ని ’బతికిన కాలేజీ’ అని సంబోధించారు. ఇది చాలా పాపులర్ అయింది కూడా. మద్రాసులో చూడదగిన స్థలాల జాబితాలో  బతికిన కాలేజీ, చచ్చిన కాలేజీ అని చెప్పుకోవడం చాలామందికి తెలుసు.
 
పులి, సింహం వంటివి క్రూర జంతువులు. సాధుజంతువులను, మనుషులను వేటాడి భుజించే స్వభావం కలిగినవి. అవి అడవిలో నివసిస్తాయి.
కానీ మనుషులు ఈవిధంగా వాటిని బోనుల్లో బంధించి వుంచి మనుషులను మధ్య ప్రదర్శనకు ఉంచడం ఆ అమ్మాయికి ఆశ్చర్యం కలిగించింది. అందుకే-
"పులులూ చిరుతలు సింహాలన్నీ వెలుపల తిరిగితే ప్రమాదమే" అని అడిగింది ఆశ్చర్యంగా .
అందుకు అతగాడు ఇలా అంటాడు.
 
"కొందరు ఘరాన మనుషులకన్నా క్రూరము కావీ జంతువులు"
అని వ్యంగ్యంగా మనుషుల్లో ఉండే క్రూర స్వబావం జంతువుల క్రౌర్యాన్ని మించిపోయిందని చెప్తాడు.  అంతే కాక క్రౌర్యం పెరిగిన మనిషిని, మృగాన్ని కటకటాలలో పెడతారు అంటూ à°“ మంచి నీతి పాఠం కూడా చెప్తాడు. జూలో జంతువులయినా, మనుషులలో నేరస్వభావం ప్రదర్శించిన వారైనా వారి నివాసం కటకటాల గదుల్లోనే అనే విషయాన్ని ఆరుద్ర ఎంతో చక్కగా చెప్పారు.
 
 "గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రాది"
 à°…ంటూ జూపార్క్ లోని జీబ్రా  అనే జంతువును చూపించి దాని లక్షణాన్ని ఆమెకి వివరిస్తాడు.  జీబ్రా చూడడానికి గాడిదలాగా ఉంటుంది. ఒళ్ళంతా నలుపురంగు నిలువు చారలుంటాయి. à°ˆ జీబ్రాపేరు లాటిన్ లో అడవిగుర్రం అనే అర్థంతో ఉండే పదం. అందుకే ఆరుద్రగారు జీబ్రాని అమ్మాయికి పరిచయం చేస్తూ గుర్రపు అంశం, గాడిద వంశం చారల చారల జీబ్రా అంటూ ఆమె ఎప్పుడూ చూడని జీబ్రాని చూపించాడు.  అలాగే  జిరాఫీ ని చూపిస్తూ
 
"చుక్కల జిరాఫీ ఒంటెకు బంధువు" అని అన్నాడు.. ఒంటె చాలా ఎత్తుగా,  బాగా సాగిన మెడతో ఉంటుంది. చూడడానికి ఒంటెలా ఉండే à°† ఆఫ్రికన్ జంతువు జిరాఫీ లేత పసుపురంగులో చుక్కలు నిండిన చర్మంతో బాగా ఎత్తుగా, బాగా సాగిన మెడతో ఉంటుంది అందుకని దాన్ని ఒంటె à°•à°¿ బంధువు అంటూ వివరించాడు.
à°† పక్కనే కోతి జాతికి చెందిన చింపాంజీలు ఉన్నాయి. వాటిని చూపిస్తూ జిరాఫీ ఒంటెకి బంధువయితే "మనిషికి బంధువు  à°ˆ చింపాంజీ" అని పరిచయం చేసాడు. మనిషి  à°ˆ రూపంలోకి రావడానికి ముందు కోతి ఆకారంలో ఉండే జంతువునుంచి పరిణమించాడని డార్విన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతం. అందుకే ఎంతో కాలంనుంచి  మనమంతా "కోతి నుంచి పుట్టాడు మానవుడు" అంటూ నమ్ముతున్నాం.
 
ఆరుద్రగారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకునే "మనిషికి బంధువు చింపంజీ"  అంటూ చమత్కరించారు. కోతులను దగ్గరగా గమనిస్తే అవి మనుషులను à°Žà°‚à°¤ చక్కగా అనుకరించగలవో చూడగలం. అందుకే
"మనుషుల చేష్టలు కోతులవైతే - కోతి చేష్టలు కొందరివి"
అంటూ కోతులు జంతువులు కనుక  జంతు స్వభావంతో మనుషులను అనుకరించడం లాంటివి చేస్తాయి. కానీ మనుషులు కోతి కన్నా అభివృద్ధి చెందిన జీవులు. మెదడు పెరిగింది. అయినా కొందరు తను మనిషిని అన్నమాట మరిచిపోయి కోతుల్లా ప్రవర్తించడం గురించి ఇలా అన్నారు ఆరుద్ర. కోతి వేషాలు అంటూ
ఆకతాయిగా ఉండే మనుషులగురించి మనం అనుకుంటూ ఉంటాం. దానిగురించే  ఆరుద్ర ఇక్కడ చక్కగా విడమర్చి చెప్పి చీవాట్లు పెట్టారు. కాకపోతే హ్యాస్య పాత్రలు పాడే పాట కనుక à°ˆ వాక్యం మొదటి సగం అబ్బాయికి , మిగతా సగం అమ్మాయికి  కేటాయించారు. à°† తర్వాత
"తీరున తిరిగే నోరును తెరిచే ఏనుగు లాంటిది ఏమిటది"
 à°…ంటూ అమ్మాయి à°“ జంతువును చూపించి అడిగింది.
 "ఏనుగు వంటిది నీటిగుర్రము దానికి తమ్ముడు ఖడ్గమృగం " అని చెప్పాడతను.
 à°à°¨à±à°—ు లాగా పెద్ద శరీరంతో నోరు ను బాగా తెరుస్తూ ఉన్న à°† జంతువు ఏనుగులాగా పెద్దగా ఉన్నా దాని పేరు నీటిగుర్రము అని చెప్పాడు.
అంతే కాక ఆ పక్కనే మరో జంతువు ఉంది. అది కూడా ఏనుగు లాగే భారీ శరీరంతో తిరుగుతోంది. దాన్ని చూపిస్తూ నీటిగుర్రంలాగే అది కూడా
పెద్ద శరీరంతో ఉందని దాని పేరు ఖడ్గ మృగం అని చెప్పాడు.
 
 à°‡à°•à±à°•à°¡ మనుషుల స్వభావం మీద మరో చురకవేసారు ఆరుద్ర.
"అధికులు పేదల కాల్చుకు తింటే ఇవి ఆకూ అలమే తింటాయి" అంటూ.
నీటిగుర్రం, ఖడ్గమృగం రెండూ ఏనుగు లాగా అతి భారీ శరీరాలున్న జంతువులే కానీ అవి కేవలం ఆకులూ అలములూ తిని
బతికే శాకాహార జంతువులు. మనుషుల్లో అధికులు అంటే సంపన్నులు పేదవారిని దోచుకుని తింటూ వారి రక్తమాంసాలను
కష్టం రూపంలో దోచుకుని తమ సంపదను పెంచుకుంటారు. నీటిగుర్రం, ఖడ్గమృగం ఆకారంలో అధికమే అయినా అవి
సాత్వికమైనవే అని చెప్తూ మనిషిలోని దుర్గుణాన్ని ఎత్తిచూపించారు.
 
జూ పార్క్ లో సందర్శకులు ఏనుగుపైన ఎక్కి ఒకసారి విహరించడానికి అవకాశం కల్పిస్తారు జూ వారు. ఆ మామయ్య, అలా వాళ్ళిద్దరూ
ఆ జూలో ఏనుగును ఎక్కారు. ఏనుగు అంబారీ ఎక్కడం అంటే మామూలుగా సామాన్యమైన విషయం కాదు కదా. పాతకాలంలో
రాజులు, ఎంతో గొప్పవారు మాత్రమే ఏనుగును ఎక్కగలిగేవారు. గజారోహణంకి ఓ ప్రత్యేకమైన విలువుంది. అందుకే అమ్మాయికి పట్టలేని
సంతోషం కలిగింది. కానీ " రాజులు ఎక్కే అంబారీపై అందరు ఎక్కుట తప్పు కదా" అంటూ రాజులు మాత్రమే ఎక్కగలిగే అంబారీపై
సామాన్యులమైన తమలాంటి వారు ఎక్కి తిరగడం తప్పేమో అనే అమాయకపు ఆలోచనతో అతగాడిని అడిగింది.
 
మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఒకప్పుడు మాహారాజులు పరిపాలించిన ప్రాంతాలన్నిటా రాజరికం పోయి  ప్రజలచే ఎన్నుకోబడిన
నాయకులతో నడిచే ప్రభుత్వాలు వచ్చాయి. అదే ప్రజా స్వామ్యం.  అందుకే ఆరుద్ర  ఇక్కడ-
" రాజులు పోయి రోజులు మారి ప్రజలే ప్రభువులు ఈనాడు "
అంటూ భారతదేశం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య విధానాన్ని ఆ అబ్బాయి పాత్ర ద్వారా చెప్పించి అమ్మాయికి పరిచయం చేసారు.
"ఒహొహో మావయ్యా ఇదేమయ్యా" అంటూ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు, "ఒహొహో అమ్మాయి" అంటూ ప్రతి సంబోధనతో అబ్బాయితో
జవాబులు చెప్పించి పరోక్షంగా ఎన్నో విషయాలను చెప్పిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ సరదా పాటల్లో మేటిగా నిలిచింది.
నిజానికి ఈ పాటలోని భావం, భాష ఓ కథానాయకుడికి పాత్ర ద్వారా ఆవిష్కరించదగ్గ అర్హత కలిగినవి . కానీ వాటిని హస్య పాత్రలతో ప్రతిఫలింప చేయడం
చూస్తే - ఆ రోజుల్లో పాటలను ఎంత బాధ్యతగా సృష్టించేవారోననిపిస్తే వారి సంస్కారానికి అబినందించకుండా వుండలేం.
 
ఈ విశ్లేషణను రాసింది
శ్రీమతి సుధారాణి పంతుల