This website is purely meant for music lovers. None of the material is used for commercial purposes. We are just creating an Archive of Telugu lyrics for the next generation. The rights belong to respective owners. If anyone claims the copyright - we will make sure to remove the same.
Categories
Search...
 

అడుగుపెట్టింది బాల నటిగానైనా హీరోయిన్ à°—à°¾ అంచెలంచెలుగా  జాతీయ స్థాయికి  ఎదిగి -ఆందంలోనూ, అభినయంలోనూ, అంతఃకరణ లోనూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన శ్రీదేవి ఫిబ్రవరి 24à°¨ హఠాత్తుగా మరణించడం పట్ల ప్రజలు, ప్రేక్షకులు, యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి à°•à°¿ లోనవడమే కాక ఆమెను గురించి తమకు తెలిసిన విషయాలను, విశేషాలను పంచుకున్నారు. అలా ఎంతోమందికి తెలియని, మరుగున పడిపోయిన మరి కొన్నిటిని ఇక్కడ ...
శ్రీదేవి తల్లి రాజేశ్వరి నటిగా గుర్తింపుని తెచ్చుకుందామని పరిశ్రమకు వచ్చింది. సావిత్రి హీరోయిన్ à°—à°¾ నటించిన ’చివరకు మిగిలేది’ (1960) లో ’అందానికి అందం నేనే’ అనే పాటకు నర్తకి జ్యోతి తో పాటు నృత్యం చేస్తూ కనిపిస్తుందామె. 
ఏయన్నార్, రాజసులోచన నటించిన ’శాంతినివాసం’ (1960) లో కృష్ణకుమారి à°•à°¿ సోదరి పాత్రకి వెతుకుతుంటే ’చివరకు మిగిలేది’ లో ఆమెను చూసిన నటుడు కాంతారావు ’రాజేశ్వరి అనే à°“ కొత్తమ్మాయి వచ్చింది. ఆమె పనికొస్తుందేమో చూడండి’ అని సజెస్ట్ చేశారు. అలా ఆమెకి à°† పాత్ర లభించింది. à°† సినిమాలో కృష్ణకుమారి అభినయించిన హిట్ సాంగ్ ’కలనైనా నీ వలపే’ లో కనిపించింది రాజేశ్వరి. à°’à°• విధంగా à°† సినిమాలో ఆమెది పెద్ద పాత్రే. 
à°† à°¤à°°à±à°µà°¾à°¤ ఏయన్నార్, కృష్ణకుమారి నటించిన ’భార్యాభర్తలు’ (1961) లో à°“ చిన్న రోల్ వేసింది. à°† సినిమా ప్రారంభంలో అక్కినేనిది ఎంతో మంది అమ్మాయిలతో తిరిగే పాత్ర. అందులో అక్కినేని అభినయించిన పాప్యులర్ గీతం ’జోరుగా హుషారుగా షికారు పోదమా’ లో ఆయన వెంటపడే à°’à°• అమ్మాయిగా కనిపించింది రాజేశ్వరి. అటు అక్కినేని తోను ఇటు ఆయన కుమారుడు నాగార్జున తోనూ నటించిన క్రెడిట్ శ్రీదేవికుంటే - ఇటు ఆమె తోనూ అటు ఆమె తల్లి రాజేశ్వరి తోనూ నటించిన క్రెడిట్ ఏయన్నార్ అకౌంట్ లో ఉన్నాయి.
బాలనటిగా తెలుగులో శ్రీదేవి తొలిచిత్రం ’ మా నాన్న నిర్దోషి’ (1970) లో ’ఎంతెంత దూరం’ పాటలో ఆమె à°šà±‚పిన హావభావాలు సీనియర్ నటీమణులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దాంతో ఆమె లేని చిత్రం అప్పట్లో ఉండేది కాదనే చెప్పాలి.
ఇవిలా వుండగా 1972 లో హిందీలో శక్తిసామంత ’అనురాగ్’ అనే సినిమా తీశాడు. నటి మౌసమీ చటర్జీకి అదే తొలి చిత్రం. అందులో ఆమె అంధురాలిగా నటించింది. అదే సినిమాని 1975 లో ’అనురాగాలు’ పేరిట à°¤à±†à°²à±à°—ులో à°¤à±€à°¶à°¾à°°à±. అప్పడు దర్శక నిర్మాతలకు శ్రీదేవి మాత్రమే సూటవుతుందనిపించింది . అలా à°† సినిమా హీరోయిన్ à°—à°¾ శ్రీదేవికి తొలి చిత్రం అయింది. అందరూ అనుకుంటున్నట్టుగా 1978 లో వచ్చిన ’పదహారేళ్ళ వయసు’ హీరోయిన్ à°—à°¾ శ్రీదేవికి తొలిచిత్రం కాదు.
ఇక హీరోయిన్ à°—à°¾ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆమెను గురించిన విషయాలన్నీ అందరికీ తెలుసు. కానీ కొదరికే తెలిసిన తమాషా సంఘటన ఒకటుంది. అదేటంటే - ’క్షణక్షణం’ సినిమాలో ’కింగులా కనిపిస్తున్నాడు’ అనే పాటను శ్రీదేవి స్వయంగా తానే పాడింది. à°† పాట రికార్డింగ్ à°•à°¿ తనతో పాటు à°“ అమ్మాయిని వెంట పెట్టుకుని వచ్చింది శ్రీదేవి. తను కొంచెం పాడడం - à°† అమ్మాయి బాగుందని కళ్ళతో 
ఓకే అంటే శ్రీదేవి ’ బాగా వచ్చిందండీ’ అనడం - ఒకవేళ à°…à°‚à°¤ తృప్తిగా రాకపోతే à°† అమ్మాయి కళ్ళతోనే సైగ చేస్తే ’మరోసారి చూద్దాం à°…à°‚à°¡à±€’ అని శ్రీదేవి అనడం - అలా à°† పాటంతటికీ à°† అమ్మాయి జడ్జిమెంట్ నే ఫాలో అయింది శ్రీదేవి. à°† అమ్మాయి ఎవరో కాదు ... తర్వాతి రోజుల్లో హీరోయిన్ à°—à°¾ ప్రేక్షకులకు పరిచయమైన మహేశ్వరి.
ఇవాళ మనం ఎంత తల్చుకున్నా, ఎన్ని చెప్పుకున్నా అవన్నీ తాత్కాలికంగా లభించే ఓదార్పులే - ఎందుకంటే శ్రీదేవి లాంటి నటి ఇంతకు ముందు లేదు. భవిష్యత్తులో వస్తుందో లేదో తెలియదు కాబట్టి .

రాజా (మ్యూజికాలజిస్ట్)
(ఇండియా గ్లిట్జ్ సౌజన్యంతో)
ఈ విషయాలన్నిటినీ వీడియో రూపంలో చూడాలనుకుంటే దిగువనున్న లింక్ ని క్లిక్ చెయ్యండి